గజ్వేల్ లో కుంగిన డబుల్ బెడ్రూం ఇళ్లు

గజ్వేల్ లో కుంగిన డబుల్ బెడ్రూం ఇళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఇళ్ల కోసం ఏళ్ల తరబడి జనం ఎదురుచూస్తుంటే....మరోవైపు వచ్చిన ఇళ్లల్లో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలోని సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్లో డబు బెడ్ రూం ఇళ్లు కుంగిపోయాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ఇళ్లల్లో ఫ్లోరింగ్ కుంగిపోయింది. మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్వేల్ సమీపంలో ఇచ్చిన పునరావాస కాలనీ ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది.  ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన పలు ఇళ్లు కుంగి పోవడంతో పాటు స్లాబ్ ల నుండి నీరు కారుతుందని చెప్తున్నారు పబ్లిక్. నాసిరకంగా పనులు చేయడంతో ఇలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం.