ఇయర్ ఎండ్ ఆఫర్లతో ముంచెత్తుతున్న ఆన్లైన్ కంపెనీలు
ఈరోజే లాస్ట్
బెంగళూరు : ఈకామర్స్ కంపెనీలు ఇయర్ ఎండ్ సేల్స్తో మన ముందుకు వచ్చాయి.ఫ్లిప్కార్ట్ శనివారం నుంచి సోమవారం వరకు ఇయర్ ఎండ్ సేల్ పేరుతో డిస్కౌంట్ ఆఫర్స్అందిస్తుండగా.. అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో ఇయర్ ఎండ్ సేల్ను శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహిస్తోంది. ఈ రెండు సైట్లలో కూడా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. వీటిని 2019లో బెస్ట్ ఆఫర్స్గా ఫ్లిప్కార్ట్ చెబుతోంది. ఈ సేల్ కోసం ఫ్లిప్కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్తో భాగస్వామ్యమైంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవాలపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంటిస్తోంది. చాలా ఫోన్లపై ఫ్లిప్కార్ట్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్పై 75 శాతం వరకు ధరలు తగ్గించింది. ల్యాప్టాప్లను అతి తక్కువగా రూ.19,999కే లిస్ట్ చేసింది.
ఫ్లిప్కార్ట్ ఫోన్లపై అందించే డీల్స్…
రెడ్మి నోట్ 7 ప్రొ 4జీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.4 వేలు తగ్గించి రూ.9,999కే అందిస్తోంది. అదేవిధంగా రియల్మీ 5 ప్రొ స్మార్ట్ఫోన్ రూ.11,999కే లిస్ట్ చేసింది. రెడ్మి 8(4జీబీ ర్యామ్ ఆప్షన్)ను కేవలం రూ.7,999కే అందిస్తోంది. వివో జెడ్1 ప్రొ ఫోన్(4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) ధర రూ.12,990. 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ మోడల్ రూ.13,990కి అమ్ముతోంది. ఈ రెండు వేరియంట్లపై వెయ్యి రూపాయల వరకు ధరలు తగ్గించింది. ఐఫోన్ 8 లాంటి క్లాసిక్ ఫ్లాగ్షిప్లు కూడా ఆఫర్లలో ఉన్నాయి. ఐఫోన్ 8ను అతి తక్కువగా రూ.33,999కే ఆఫర్ చేస్తోంది. పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్ రూ.30,999కి, శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ రూ.29,999కి, ఐఫోన్ ఎక్స్ఎస్ 64జీబీ వేరియంట్ను రూ.59,990కి లిస్ట్ చేసింది.