
సీరియల్ నటి పవిత్ర జయరాం(Pavitra jayram) గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రియుడు, సహనటుడు చంద్రకాంత్(Chandrakanth) తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన చంద్రకాంత్ శుక్రవారం(మే 17) పవిత్ర ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పవిత్ర లేని లోకంలో తాను ఉండలేనంటూ మరణానికి ముందు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టిన చంద్రకాంత్.. ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చంద్రకాంత్ మరణంతో సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
అయితే.. తాజాగా చంద్రకాంత్ మృతిపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. చంద్రకాంత్ గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.. నాతో ముందే అన్నాడు నేను ఉండను చనిపోతాను అని. కానీ ధైర్యం చెప్పాను. ఆత్మహత్య పాపం అని చెప్పాను. కానీ, ఆపలేకపోయాను. చందు యాదవ్ అని పిలిస్తే.. నన్ను మీరొక్కరే అలా పూర్తి పేరుతో పిలుస్తారు అనేవాడు. నేను, చందు చాలా సీరియల్స్ చేశాం. త్రినయనిలో సీరియల్ లో కూడా కలిసి చేశాం. రోజు మాట్లాడేదాన్ని.. నిన్న ఒకరోజు జర్నీలో ఉండటం వల్ల కాల్ చెయ్యలేదు తమ్ముడు. ఇంతలోనే ఇలా దూరం అవుతావని ఊహించలేదు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ ఎమోషనల్ అయ్యారు కరాటే కల్యాణి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.