భారీగా పెరిగిన చికెన్ రేటు

భారీగా పెరిగిన చికెన్ రేటు
  • ఎగ్ ₹ 5, మటన్ ₹ 850
  • ట్రాన్స్ పోర్ట్ ప్రాబ్లమ్ అంటున్న వ్యాపారుల

కరోనా ఎఫెక్ట్ తో పడిపోయిన చికెన్ ట్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఐదింతలు పెరిగాయి. గుడ్డు కూడా 5రూపాయలకు చేరింది. కరోనా పుకార్లతో మార్చిలో చికెన్‌‌‌‌‌‌‌‌ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. తినేందుకే జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని జిల్లాల్లో కోళ్లుఫ్రీగా ఇచ్చారు. మరికొన్నిచోట్ల పాతిపెట్టారు . పౌల్ట్రీ పరిశ్రమకు దాదాపు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది. చికెన్‌‌‌‌‌‌‌‌ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం, జనం కూడా ఇండ్లల్లోనే ఉంటుండడంతో గిరాకీ ఊపందుకుంది. ఆదివారం హైదరాబాద్ లోని చికెన్ సెంటర్ల దగ్గర  జనం బారులు దీరారు. గతంలో స్కిన్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ కిలో రూ.40 ఉండగా, తాజాగా రూ.230 వరకు అమ్మారు. విత్‌ స్కిన్‌ ‌‌‌‌‌‌‌కిలో రూ.200, లైవ్‌‌‌‌‌‌‌‌100 నుంచి 120 వరకు విక్రయించారు. గుడ్డు ధరలు కూడా అమాంతం పెరిగాయి. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో ఒక్క గుడ్డు రూ.3 ఉండగా, ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు మటన్‌‌‌‌‌‌‌‌ ₹700 నుంచి ₹ 850కి పెరిగింది. మాంసం ధరలు పెరగకుండా చూస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకున్నట్లు కనిపించడం లేదు.

ధరలు ఎందుకు పెరిగాయంటే…

దేశవ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. జనజీవనం, రవాణా స్తంభించింది. అత్యవసర సరుకులను మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతో కోళ్లు , మేకలు, గొర్రెల ట్రాన్స్ ‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోయింది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ కు ముందు పెద్దఎత్తున కోళ్లను పాతిపెట్టారు. ఆ తర్వాత కూడా పౌల్ట్రీల్లో పెద్దగా పెంపకం చేపట్డడంలేదు. ఇలా డిమాండ్ మేరకు సప్లయ్ లేక ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తక్కువ మొత్తంలో కోళ్లు , మేకలు ఉండటంతో ఎక్కువ ధరకు అమ్ముతున్నామని, ఇప్పటికే కరోనా ప్రభావంతో పెద్దఎత్తున నష్టపోయామని వ్యాపారులు చెబుతున్నారు.