శ్రీశైలం రిజర్వాయర్ ఐదు గేట్లు మూసివేత

శ్రీశైలం రిజర్వాయర్ ఐదు గేట్లు మూసివేత

ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గడంతో ఇవాళ(సోమవారం) ఉదయం వరకూ తెరచుకుని ఉన్న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. నిన్నటి వరకూ 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా… 10 గేట్లను తెరచిన అధికారులు, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలారు.  సోమవారం ఉదయం 5 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. ఎగువ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్న కారణంగా గేట్లను మూసివేసినట్టు తెలిపారు. వస్తున్న నీటిలో కొంతభాగాన్ని రిజర్వాయర్ ను నింపేందుకు, ఇతర కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా తరలింపునకు వాడుతున్నామని చెప్పారు. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉండే రిజర్వాయర్ లో ప్రస్తుతం 882.70 అడుగుల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి వచ్చే నీటిని బట్టి… గేట్ల మూసివేతపై  సాయంత్రం లేదా మంగళవారం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.