కళ్యాణ మండపంలో పెళ్లికొడుకు ఆత్మహత్య

కళ్యాణ మండపంలో పెళ్లికొడుకు ఆత్మహత్య

మరికాసేపట్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ వరుడు ఏవో కారణాల చేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లి లోని శ్రీ ఫంక్షన్ హాల్ లో జరిగింది. శుభకార్యానికి హాజరైన వరుడు సందీప్ (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 11:35 గం.ల మౌనిక అనే యువతిని సందీప్ పెళ్లాడాల్సి ఉంది. కాని ఇంతలోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పెళ్లి మంత్రాలతో మారుమ్రోగనున్న ఆ కళ్యాణ మండపంలో అతని ఆత్మహత్యతో  కలకలం రేగింది. పెళ్లికి వచ్చిన బంధువులు జరిగిన విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు వారు సమాచారమందించారు . వెంటనే ఆ కళ్యాణమండపానికి చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

The groom committed suicide In the marriage function hall

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి