తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. తలసాని సాయికిరణ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మంత్రి కేటీఆర్ పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని మంత్రి మహమూమద్ అలీ ప్రారంభించారు. భారీ కేక్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కట్ చేశారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ వాణిదేవి, దానం నాగేందర్, ముఠా గోపాల్ పాల్గొన్నారు.
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి దగ్గర వినూత్న రీతిలో మంత్రి కేటీఆర్ కు అభిమానులు విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ భారీ కార్ల ప్రదర్శన చేశారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే ఏర్పాట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంటానన్న కేటీఆర్.. కార్యకర్తలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం లెగ్ ఫ్యాక్చర్ తో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు మంత్రి కేటీఆర్.