సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

హైదరాబాద్, వెలుగు: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా రెండోసారి ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సీపీఐ 24వ జాతీయ మహాసభలు మంగళవారంతో ముగియగా.. కొత్త కమిటీని ఎన్నుకున్నారు. 11 మంది కార్యదర్శుల ను, 31 మంది కార్యవర్గ సభ్యులను, 125 మంది జాతీయ సమితి సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నారాయణ, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

తెలంగాణ నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులుగా అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి ఎన్నికవగా, జాతీయ సమితి సభ్యులుగా చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, బాలనర్సింహా, బాగం హేమంతరావు, నర్సింహ, బాలమల్లేశ్ ఉన్నారు.