
సీరియల్ నటి పవిత్ర జయరాం(Pavitra jayram) గత ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రియుడు, సహనటుడు చంద్రకాంత్(Chandrakanth) తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన చంద్రకాంత్ శుక్రవారం(మే 17) పవిత్ర ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పవిత్ర లేని లోకంలో తాను ఉండలేనంటూ మరణానికి ముందు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టి మరీ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు చంద్రకాంత్. అతని మరణంతో సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే.. వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు వీరి ప్రేమ ఎక్కడ మొదలయింది? ఒకరినివదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరి ప్రేమ కథ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బయట పవిత్ర జయరాం, చంద్రకాంత్ ను చూసిన చాలా మంది ఈ ఇద్దరు భార్య భర్తలు అనుకుంటారు. కానీ, కాదు. వాళ్లు కేవలం సహజీవనంలో ఉన్నారు. చంద్రకాంత్ ఇప్పటికే శిల్ప అనే యువతిని 2015లోనే ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఇక పవిత్రకు కూడా ఇప్పటికే పెళ్లి జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయింది పవిత్ర. చంద్రకాంత్ కి ముందు ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ ఉండేది. ఆ సమయంలొనే అతనికి నటుడిగా సీరియల్ లో అవకాశం రావడంతో కంపెనీని వదిలేశాడు.
అలా త్రినయని సీరియల్ లో నటిస్తున్న సమయంలో పవిత్ర, చంద్రకాంత్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా దాదాపు 5 సంవత్సరాల నుండి ఇద్దరు సహజీవనంలో ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకొని ఒకటవ్వాలనుకున్నారు కానీ, ఇంతలోనే ఊహించని విదంగా వారి ప్రేమ విషాదంగా మారింది.