ఎల్బీనగర్ లో మందుబాబుల వీరంగం.. ఒకరు మృతి

ఎల్బీనగర్ లో మందుబాబుల వీరంగం.. ఒకరు మృతి

హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో ఒకరు మృతి మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని  చెప్పినందుకు  యువకులపై దాడి చేశారు. కేకే గార్డెన్ వెనక ఖాళీ ప్రదేశంలో మందుబాబుల వీరంగం సృష్టించారు. దీంతో ఇక్కడ మద్యం సేవించవద్దు అని కాలనీకి చెందిన యువకులు వారిని వారించారు.దీంతో మందుబాబులు యువకులపై దాడికి దిగారు. ఈ ఘటనలో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.  దాడి చేసిన మందుబాబులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎల్బీనగర్ పోలీసులు.