హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన అతని భార్య స్వప్న
హైదరాబాద్: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు మృతిపై మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు అతని భార్య స్వప్న. తన భర్తది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యే అని , అతని మృతి పై, జైలు సిబ్బంది పై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు నాగరాజు కుటుంబ సభ్యులు. నాగరాజు పై తప్పుడు కేసులు పెట్టిన ఏసీబీ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు
అక్రమ కేసులతో తన భర్తను ఏసీబీ వేధింపులకు గురి చేసిందని, పలు రాజకీయ నాయకులకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని నాగరాజు భార్య స్వప్న అన్నారు. నాగరాజు మృతిపై త్వరలోనే హైకోర్టు ను ఆశ్రయిస్తామని, ఏసీబీ కేసులను సీబీఐ తో విచారణ జరిపించాలని అన్నారు. భర్త మృతి కి కారణమైన దోషులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తానని చెప్పారు.