రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మిడ్మానేరును టూరిజం స్పాట్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. మిడ్మానేరుబ్యాక్వాటర్ సమీపంలో 150 ఎకరాల్లో కాటేజీలు, హౌసింగ్బోట్లు, ఆక్వాహబ్, పార్క్లు, జల క్రీడల ఏర్పాటు, రోప్వే, వేలాడే వంతెన, రిసార్ట్స్, హరితహోటల్, హెలిప్యాడ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మిడ్మానేరు తీరం సుమారు 23 కి.మీ. పొడవు ఉంది. గుట్టలను ఆనుకుని ఎఫ్ టీఎల్లెవల్కంటే ఎత్తులో కనీసం 15 కి.మీ. రోడ్డు నిర్మించనున్నారు. ఈ పనులన్నింటికి సుమారు రూ.400 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. దీంతోపాటు జిల్లాలోని నాంపల్లి గుట్టపై నెలవైన లక్ష్మీనరసింహ స్వామి గుట్ట నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు కేబుల్కార్స్ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రోడ్లు మెరుగుపడితే హైదరాబాద్నుంచి రెండు గంటల్లో సిరిసిల్ల చేరుకోవచ్చని, ఐటీ ఉద్యోగులు సైతం వీకెండ్ఎంజాయ్ కోసం సిరిసిల్ల సందర్శించే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
90 శాతం ప్రభుత్వ భూములే…
ఈ నెల 11,12న అధికారులు రెండు రోజులపాటు హైదరాబాద్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మిడ్మానేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మిడ్మానేరు బ్యాక్వాటర్సమీపంలో 90 శాతానికి పైగా ప్రభుత్వ భూములు ఉండటంతో భూసేకరణకు పెద్దగా ఖర్చవదు. మిడ్మానేరుబ్యాక్వాటర్, సిరిసిల్లకు అతి సమీపంలో సుమారు 550 మీటర్ల ఎత్తున్న రామప్పగుట్ట ఉండటం, ఈ గుట్టపై 40 ఎకరాలకు పైగా అనుకూలమైన స్థలం ఉండటంతో అతిథిగృహం నిర్మించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మిడ్మానేర్ప్రాంతంలో రామప్పగుట్టను ఆనుకుని కాటేజీలు, 100 ఎకరాల్లో ఆక్వా హబ్, 50 ఎకరాల్లో కాటేజీలతోపాటు, జలక్రీడలు, చిల్ర్డన్పార్క్, హౌస్ బోటింగ్, మానేరుపై ఊగే వంతెన, రైల్వే బ్రిడ్జి, రోప్వే, మానేరు బ్యాక్వాటర్ఐలాండ్లో విడిది కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. నిధుల సమీకరణలో ప్రభుత్వంపై భారం పడకుండా పబ్లిక్, ప్రైవేట్(పీపీపీ) పద్ధతిలో టూరిజం స్పాట్ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
టూరిజానికి అనుకూల ప్రాంతం
మిడ్మానేరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ఆదేశాలతో ముందుకు వెళ్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహజసిద్ధమైన వనరులున్నాయి. ఇటు ఆధ్యాత్మికంగా.. అటు ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కి.మీ. దూరంలో టూరిజం స్పాట్ఉంటుంది. ఆ పక్కనే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, నాంపల్లి పుణ్యక్షేత్రం ఇవన్నీ కలసివస్తాయి. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు మిడ్మానేరు ప్రాంతంలో నిర్మించే కాటేజీలో విడిది చేసి.. దర్శనానికి వెళ్లే రోజులు రానున్నాయి.
– కృష్ణభాస్కర్, కలెక్టర్, రాజన్నసిరిసిల్ల