నేను మంథని మట్టి బిడ్డను, వజ్రాన్ని.. మోసగాణ్ని కాదు

నేను మంథని మట్టి బిడ్డను, వజ్రాన్ని.. మోసగాణ్ని కాదు

పెద్దపల్లి జిల్లా: లాయర్ దంపతుల హత్య కేసులో కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని టీఆర్ఎస్ లీడర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు. మంథని లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొన్ని మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి కేసు విచారణ కూడా సదరు మీడియా సంస్థలే చేస్తున్నాయని, వారే పోలీసులా..? అంటూ మండిప‌డ్డారు.

“ఓ కాంగ్రెస్ లీడ‌ర్ కు తొత్తులుగా మారి కొన్ని టీవీలు, పేపర్లు నా మీద విషం కక్కుతున్నాయి. ఎందుకు నేను అంటే అంత అక్కసు మీకు..? నాకు డబ్బు లేదనా..? నాపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. నా మీద రాయిమంటే రాస్తారు చూపించమంటే చూపిస్తారా? హైదరాబాద్ లో వున్న మీడియా వాళ్లకు మంథని లో ఏం జరుగుతుందో మీరే డిసైడ్ చేస్తారా…. మీరు లోకల్ రిపోర్టర్ల ను అడగారా.? “అని ప్ర‌శ్నించారు. “నేను మంథని మట్టి బిడ్డను, వజ్రాన్ని… మోసగాన్ని కాదు. విచారణ పూర్తి అయ్యాక హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అమ్ముడుపోయిన మీడియా సంగతి చెప్తా” అని వార్నింగ్ ఇచ్చారు.