అడక్కతింటున్నదెవరు?

అడక్కతింటున్నదెవరు?

ఏపీ సీఎం జగన్, ఆంధ్రా వాళ్లపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదస్పద కామెంట్స్ చేశారు. తెలంగాణ వస్తే అడుక్కు తింటారన్న వాళ్లే ఇప్పుడు అడ్కుకుంటున్నారని అన్నారు. ఏపీకి మన పైసలు పోకపోవడంతో ఆ రాష్ట్ర సీఎం జగన్ రోజు వారీ ఖర్చులకే కేంద్రం బిచ్చమెత్తుకుంటుండని.. అందుకే బాయి కాడ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నారని విమర్శించారు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.  ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్నారు. అయినా కేసీఆర్ ఏమి అడుక్కోవడానికి పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని ప్రశ్నించారు. మా సంగతి పక్కన పెట్టి మీకెన్ని అప్పులున్నాయో.. బ్యాంకులు, కాంట్రాక్టర్లను అడిగితే తెలుస్తుందన్నారు.