నీట్ పీజీ కౌన్సెలింగ్ లేటవడంపై నిరసన
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పీజీ కౌన్సెలింగ్ 2021ను పదే పదే వాయిదా వేయడానికి నిరసనగా ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె చేపట్టాలని, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలను నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. వెనుకబడిన వర్గాలకు రూ.8 లక్షల వార్షిక ఆదాయంపై రివ్యూ చేయాలని నిర్ణయించినందున నీట్ పీజీ మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ మరో 4 వారాలు వాయిదా వేస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.