- 2 నెలలుగా కాజీపేట-బల్లార్షా మధ్య ఆటంకాలు
- ట్రాక్ రిపేర్లు, టెక్నికల్ ఇష్యూలతో తరచూ క్యాన్సిల్
- కొత్తగూడెం వెళ్లేందుకు సింగరేణి కార్మికులకు కష్టాలు
- ఎక్కువ హాల్టింగ్లు ఉన్న ప్యాసింజర్, పుష్ఫుల్ రైళ్ల నిలిపివేత
కోల్బెల్ట్, వెలుగు: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట–-బల్లార్షా, విజయవాడ– సికింద్రాబాద్మార్గంలో మూడో రైల్వే లైన్ట్రాక్రిపేర్లతో తరచూ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్తున్నారు. ఇటీవల రైల్వే శాఖ ట్రాక్ పునరుద్ధరణ, టెక్నికల్ఇష్యూలతో కాజీపేట–-బల్లార్షా సెక్షన్ల మధ్య నడిచే పలు ప్యాసింజర్రైళ్లను ఈనెల 20వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలలుగా తరచూ రైళ్ల రద్దుతో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్జిల్లాల పరిధిలో రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు అవస్థలు పడ్తున్నారు.
అసలే తక్కువ.. అపై రద్దు
వ్యాపార, ఉద్యోగం, చదువుల కోసం సింగరేణి ఏరియా, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు డెయిలీ దాదాపు 12వేల మంది రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో అత్యధికులు సింగరేణి కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, పాలవ్యాపారులు. వీరికి కాజీపేట, భద్రాచలం రోడ్, కాగజ్నగర్, బల్లార్షా, కరీంనగర్ మధ్య నడిచే సింగరేణి, రామగిరి, పుష్ఫుల్మెమూ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో చార్జీలు కూడా తక్కువ కావడం, ఎక్కువ స్టేషన్లలో స్టాపింగ్ కల్పించడంతో ఈ మూడు రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఏండ్లుగా ఈ మార్గంలో మరికొన్ని కొత్త రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్– -బల్లార్షా మధ్య భాగ్యనగర్, ఇంటర్సిటీ, కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇవి కొన్ని స్టేషన్లలో ఆగడం, చార్జీలు ఎక్కువగా ఉండడంతో కొందరికే అనుకూలంగా ఉన్నాయి.
జంక్షన్లతో సంబంధం లేకున్నా ..
కాజీపేట–-బల్లర్షా మూడో రైల్వేలైన్ దాదాపు పూర్తికాగా.. ఆర్వోబీ, కొన్ని చోట్ల కల్వర్టులు, రిపేర్ల పేరుతో అడపాదడపా రైళ్లు నిలిపివేస్తున్నారు. మరోవైపు ఈ సెక్షన్ మధ్య సంబంధం లేని చోట జరిగే రిపేర్లను సాకుగా చూపుతూ రైళ్లను రద్దు చేస్తున్నారు. బల్లార్షా-చంద్రాపూర్, విజయవాడ, -డోర్నకల్ జంక్షన మధ్య రిపేర్లు జరిగినా కాజీపేట-–కాగజ్నగర్ మధ్య రైళ్లను కూడా నిలిపివేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్–-కరీంనగర్ పుష్పుల్ కూడా ఆపుతున్నారు. రైల్వే లైను రిపేర్ల కారణంగా 19 నుంచి వారం రోజులు పాటు పలు రైళ్లను రద్దు చేశారు.
సికింద్రాబాద్డివిజన్ పరిధిలో ఇన్ఫ్రాస్ర్టక్చర్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో జులై 3 నుంచి 9 తేదీ వరకు సిర్పూర్ టౌన్–-కరీంనగర్ ఇరువైపులా, కాజీపేట–-సిర్పూర్టౌన్, బల్లార్షా–-కాజీపేట, భద్రాచలంరోడ్–-బల్లార్షా ఇరువైపులా రైళ్లను రద్దు చేశారు. జులై 17 నుంచి 24 వరకు కాజీపేట–-సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా-–కాజీపేట(రామగిరి), భద్రాచలంరోడ్–-బల్లార్షా(సింగరేణి), సిర్పూర్–-కరీంనగర్(పుష్పుల్)రైళ్లు రద్దు చేశారు. భారీ వర్షాలతో కాజీపేట–-బల్లార్షా మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను మళ్లీ జులై 31 వరకు రద్దు చేసింది. మళ్లీ 6 తేదీ నుంచి మూడో రైల్వే ట్రాక్ పనులు, ఇతరత్రా కారణాలతో సింగరేణి, రామగిరి, కరీంనగర్ పుష్పుల్ రైళ్లను రద్దు చేస్తూ.. పొడిగిస్తూ.. ఈనెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రయాణికులు దూరభారం.. చార్జీలు ఎక్కువైనా బస్సులు, ప్రైవేట్ వెహికల్స్పై రాకపోకలు సాగిస్తున్నారు.
కొత్తగూడెం వెళ్లడం కష్టమవుతోంది
ఉద్యోగరీత్యా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్కు వివిధ పనుల కోసం వెళ్తాం. అక్కడికి వెళ్లడానికి నలభై ఏండ్లుగా సింగరేణి రైలుపై ఆధారపడ్తున్నం. ట్రాక్ రిపేర్ల పేరుతో నెలలో పదిహేను రోజులు రైలును రద్దు చేస్తున్నరు. వందల కి.మీ దూరం బస్సులో వెళ్లడం ఇబ్బందికరంగా మారింది.
అల్లి రాజేందర్, సింగరేణి ఉద్యోగి
అధిక చార్జీలతో భారం
కాజీపేట–-బల్లార్షా మధ్య అన్ని స్టేషన్లలో స్టాఫ్ ఉండే సింగరేణి, రామగిరి రైళ్ల రద్దుతో ఎక్కువ చార్జీలు పెట్టుకొని ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో వెళ్లాల్సి వస్తోంది. పేద, మిడిల్క్లాస్ ప్రయాణికులకు చార్జీలు భారమవుతున్నాయి. అలాగే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రెండు మూడు గంటల ఆలస్యంగా నడుస్తున్నది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్తున్నారు.
ఎండి.పాషా, రామకృష్ణాపూర్