దిశ నిందితుల ఎన్ కౌంటర్: హైదరాబాద్‌కు జ్యుడీషియల్ కమిటీ

దిశ నిందితుల ఎన్ కౌంటర్: హైదరాబాద్‌కు జ్యుడీషియల్ కమిటీ

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు నియమించిన జ్యుడిషయల్ కమిటీ  హైదరాబాద్ చేరుకుంది.  జ్యుడీషియల్ కమిటీలో మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖ ప్రకాష్ సభ్యులుగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై కమిటీ వేసింది సుప్రీం కోర్టు. ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలపై ఈ కమిటీ ఆరా తీయనుంది. హైకోర్టు సీ  బ్లాక్ లో కమిటీ ఉండనుంది. కమిటీ సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిందితుల పోస్టుమార్టం, రీ పోస్టుమార్టం రిపోర్ట్ ను పరిశీలించనుంది జ్యుడీషియల్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి వివరాలు తీసుకోనుంది కమిటీ.