ఢిల్లీ తరహాలో పంజాబ్ ను అభివృద్ధి చేస్తా: కేజ్రీవాల్

ఢిల్లీ తరహాలో పంజాబ్ ను అభివృద్ధి చేస్తా: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోనూ ఉచిత ఉద్య, 24 గంటల విద్యుత్, నీరు హామీని గుప్పించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇప్పటినుంచే పంజాబ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ అందించి... విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ప్లాన్ ను పంజాబ్‌లోనూ అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు కూడా ‘ఆప్’ మద్దతు పలుకుతూ, పంజాబ్ రైతులకు అండగా నిలిచింది. 

కిసాన్ మహాసమ్మేళన్‌లో పాల్గొన్న కేజ్రీవాల్.. పంజాబ్ వీరుల జన్మస్థలమని, అటువంటివారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ముందుగా పంజాబ్ తన గొంతు వినిపిస్తుందన్నారు. పంజాబ్‌లో… ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడితే ఢిల్లీలో మాదిరిగానే  అభివృద్ధి పథకాలు చేపట్టడంతో పాటు నయా పంజాబ్ ను తయారు చేస్మన్నారు. మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టి సీఎం అధికారాలను కూడా లాక్కున్నదని ఆరోపించారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారికి ఎటువంటి హాని కలుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం కేజ్రీవాల్.