కుళ్లిన చికెన్ తో ధమ్ బిర్యానీ.. రెస్టారెంట్ కు ఫైన్

కుళ్లిన చికెన్ తో ధమ్ బిర్యానీ.. రెస్టారెంట్ కు ఫైన్

భద్రాద్రి కొత్తగూడెంలోని తాటిపల్లి రెసిడెన్సీలోని గోంగూర హోటల్ లో కుళ్లిన చికెన్ బిర్యానీ పెట్టడంతో మున్సి పల్ చైర్ పర్సన్ ఫైన్ వేశారు. బుధవారం రమేశ్, మంగీలాల్ తో పాటు కొందరు బిర్యాని తినేందుకు హోటల్ కు వెళ్లి చికెన్ ధమ్ బిర్యాని ఆర్డర్ ఇచ్చారు. చికెన్ పీస్ లు నోట్లో పెట్టుకోగానే దుర్వాసన వచ్చింది. దీంతో అక్కడి స్టాఫ్ ను పిలిచి అడగ్గా ఇష్టముంటే తినండి..లేకపోతే లేదని దురుసుగా సమాధానమిచ్చారు. ఓనర్ కూడా రెస్పాండ్ కాకపోవడంతో మున్సిపల్ కమిషనర్, ఫుడ్ ఇన్ స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్లు కూడా స్పందించకపోవడంతో మున్సి పల్ చైర్
పర్సన్ కాపు సీతా లక్ష్మికి ఫోన్ చేశారు. ఆమె స్వయంగా వచ్చి బిర్యానీని పరిశీలించారు. చికెన్ దుర్వాసన వస్తుండడంతో నిర్వాహకుడికి రూ. 20వేలు ఫైన్ వేశారు. ఈ సందర్భంగా బాధితులు రెస్టారెంట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. చెకింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. హోటల్ నిర్వాహకుడు మధు మాట్లాడుతూ ఏదో పొరపాటు జరిగిందని, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.