మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి 95 వ జయంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గర నివాళులర్పించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్ పేయి సమాధి సదైవ్ అటల్ దగ్గర రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్ నాథ్, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు నివాళులర్పించారు. వాజ్ పేయి జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుతున్నారు. మూడు సార్లు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాజ్ పేయి… తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల కారణంగా 2018 ఆగస్టు 16న చనిపోయారు.
Delhi: President Ramnath Kovind,Prime Minister Narendra Modi, Home Minister Amit Shah and Lok Sabha Speaker Om Birla at 'Sadaiv Atal' memorial to pay tribute to former PM Atal Bihari Vajpayee on his birth anniversary pic.twitter.com/k0hmcKBoup
— ANI (@ANI) December 25, 2019