సిద్ధూకు పాకిస్తాన్ వీసా మంజూరు

సిద్ధూకు పాకిస్తాన్ వీసా మంజూరు

కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధూకు పాకిస్తాన్ వీసా మంజూరు చేసింది. నవంబర్ 9న జరగనున్న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాక్ ప్రభుత్వం సిద్ధూను ఆహ్వానించింది. అయితే సిద్ధూ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.

పాక్ వీసాతో వాఘా సరిహద్దు దగ్గర సిద్ధూ పాక్ లోకి అడుగుపెడతారు. అయితే, రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఆయన ఉండటంతో… పాక్ లో అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిని ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు అనుమతించాలంటూ ఇంతకు ముందే భారత విదేశాంగశాఖకు సిద్ధూ లేఖ రాశారు. ఒక సిక్కుగా కర్తార్ పూర్ కారిడార్ కార్యక్రమానికి వెళ్లడాన్ని తాను ఒక గౌరవంగా భావిస్తున్నానంటూ విదేశాంగశాఖకు రాసిన లేఖలో సిద్ధూ తెలిపారు.