శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం ఇవాళ్టి(శనివారం) తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది. శబరిమలలో నిషేధాజ్ఞలు విధించబోమని… అయితే కీలక ప్రాంతాల్లో మాత్రం 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారని పత్తనతిట్ట కలెక్టర్‌ తెలిపారు.