సమత అత్యాచారం కేసు సోమవారానికి వాయిదా

సమత అత్యాచారం కేసు సోమవారానికి వాయిదా

ఆదిలాబాద్: సమత అత్యాచార కేసును సోమవారానికి వాయిదా వేసింది స్పెషల్ కోర్టు. ఇవాళ  నిందితులతో ఫేస్ టు ఫేస్ విచారణ జరిపిన జడ్జి.. 25 మంది సాక్ష్యులు చెప్పిన వాటిపైనా నిందితులను ప్రశ్నించారు. అయితే జడ్జి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నిందితులు..  నేరం చేయలేదని తెలిపారు. అయితే నేరం చేయలేదనడానికి సాక్ష్యాలను చూపెడతారా అని అడగడంతో.. మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో కేసును సోమవారానికి వాయిదా వేశారు. నిందితుల తరపున సోమవారం రోజున గ్రామానికి చెందిన కొంత మంది పెద్దలు కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది.