ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇంటర్ పరీక్షలు ఆపలేమని  స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25 నుంచే పరీక్షలు జరగాల్సి ఉండటంతో  ఆపడం కరెక్ట్ కాదని చెప్పింది. 25 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను  రద్దు చేయాలని వేసిన లంచ్ పిటిషన్ ను విచారించింది హైకోర్టు.ఇంటర్ బోర్డు పరీక్షలకు నిర్వహించుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపింది. పిటిషన్ వేయడంలో ఆలస్యం అయిందని చెప్పింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.