రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఎండలు

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఎండలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మళ్లీ పెరిగాయి. ఇప్పటిదాకా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం టెంపరేచర్​ ఒక్కసారిగా పెరిగింది. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర అధికంగా రికార్డయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేరళకు నైరుతి రుతుపవనాలు తాకినా, రాష్ట్రంలో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో శనివారం ఎండ ఎక్కువగా ఉండే చాన్స్​ ఉందని, కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది.