గచ్చిబౌలి, వెలుగు: కాలనీలో ఖాళీ స్థలాన్ని చదును చేస్తుండగా.. అమ్మవారి విగ్రహం బయటపడ్డ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం నల్లగండ్లలో లక్ష్మీ విహార్ ఫేజ్1– కాలనీలోని ఖాళీ స్థలంలో స్థానిక చిన్నారులు ఆడుకుంటుండగా.. చెట్లపొదల్లో నుంచి పాములు రావడంతో స్థానికులు కాలనీ అసోసియేషన్కు కంప్లయింట్ చేశారు. గురువారం అసోసియేషన్ సభ్యులు జేసీబీతో అక్కడ చదును చేయిస్తుండగా.. బండరాయి అడ్డు తగిలింది. రాయిని తొలగించేందుకు మట్టిని తవ్వగా సింహవాహిని అమ్మవారి విగ్రహం బయటపడింది. ఎలాంటి కంప్లయింట్ అందలేదని పోలీసులు చెప్తున్నారు.