బంక్ లో రాత్రికి రాత్రే 4 వేల లీటర్ల డీజిల్ దోచేశారు

బంక్ లో రాత్రికి రాత్రే 4 వేల లీటర్ల డీజిల్ దోచేశారు

ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుంటే....దొంగలు రెచ్చిపోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న బంక్ నుంచి ఏకంగా 4వేల లీటర్ల డీజిల్ దోచేశారు దొంగలు. శారదా ఫిల్లింగ్ స్టేషన్ లో డీజిల్ ట్యాంకుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి భారత్ ఆయిల్ కంపెనీ వాళ్లు 4వేల లీటర్ల డీజిల్ ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇది గమనించిన దొంగలు రాత్రికి రాత్రే మోటర్లతో డీజిల్ కాజేశారు. విషయం తెలుసుకున్న ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు.