భద్రాచలం టెంపుల్​లో వెయ్యి లడ్డూలు మాయం

భద్రాచలం టెంపుల్​లో వెయ్యి లడ్డూలు మాయం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వెయ్యి లడ్డూలు మాయమయ్యాయి. సూపరింటెండెంట్​నిరంజన్​ విచారణలో ఈ విషయం బయటపడింది. లడ్డూ కౌంటర్లో అమ్మిన లడ్డూలు, వచ్చిన ఆదాయం లెక్క చూడగా వెయ్యి లడ్డూలు మాయమైనట్లు తెలిసింది. ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులకు ఆలయ ఈఓ శివాజీ మెమోలు జారీ చేశారు. వారి నుంచి లడ్డూల రేటు ప్రకారం రూ.20 వేలు రికవరీ చేశారు.