
అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ చిత్రం చాలా స్పెషల్. 2014 మే 23న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 23న తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో ఈ అప్డేట్ను షేర్ చేస్తూ..
‘తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం ‘మనం’. దీన్ని థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం’ అని పోస్ట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించాడు.