అంగన్​వాడీ పిల్లలకు స్కూల్ మెటీరియల్ పంపిణీ..బీజేపీ నేత విక్రమ్ గౌడ్

అంగన్​వాడీ పిల్లలకు స్కూల్ మెటీరియల్ పంపిణీ..బీజేపీ నేత విక్రమ్ గౌడ్

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్ సెగ్మెంట్ పరిధి అంగన్ వాడీ సెంటర్లలోని పిల్లలకు శ్రేష్ఠ్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. సంజయ్ నగర్, ఓల్డ్ ఫీల్ ఖానా, ఓంనగర్, ఎస్ డీనగర్, మచిలీపురా, మేవాటిపురా ప్రాంతాల్లోని అంగన్ వాడీ కేంద్రాల్లో స్కూల్ మెటీరియల్​ను  శ్రేష్ఠ్​ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. 

అంగన్ వాడీ కేంద్రాల్లో అన్ని వసతులతో మంచి విద్య అందిస్తే పిల్లల చదువుకు బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. తన తండ్రి,  దివంగత నేత ముఖేశ్​గౌడ్ స్ఫూర్తితోనే శ్రేష్ఠ్​ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.  ఆర్థిక కారణాలతో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉన్న పిల్లలను 10వ తరగతి వరకు వారు కోరుకున్న విధంగా చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. గోషామహల్​సెగ్మెంట్​లోని అన్ని అంగన్​వాడీ సెంటర్లను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. శ్రేష్ఠ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, క్రీడలు, ఉపాధి నైపుణ్య శిక్షణ.. ఇలా  ప్రతిరంగంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్​ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.