బషీర్బాగ్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు వస్తాయంటూ సిటీకి చెందిన వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి ఇటీవల ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తమ ప్రొడక్ట్పై ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు మొదట కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్చేయగా.. సదరు వ్యక్తి అతడికి లాభాలను చూపాడు.
దీంతో బాధితుడు ఒకేసారి రూ.27 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.