- 29న సింగరేణి జూనియర్ స్టాఫ్ నర్సు ఎగ్జామ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న జూనియర్స్టాఫ్నర్సు పోస్టుల భర్తీకి ఈ నెల 29న ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు కంపెనీ జీఎం(పర్సనల్) ఎ.ఆనందరావు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 84 పోస్టులకు గానూ 11,133 మంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని 18 సెంటర్లలో 29న ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఎగ్జామ్ ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. నియామకాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.