
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఐఎక్స్ 1132 ఎయిర్ ఇండియా విమానం బెంగళూరులోని ఎయిర్ పోర్టులో మే 18న రాత్రి 11.10 గంటల కు ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో ల్యాండ్ అయిన వెంటనే అధికారులు మంటలను ఆర్పేశారు. ప్రయాణికులంతా సేఫ్ గాఉన్నారని ప్రకటించారు అధికారులు.