గాలే పిచ్‌పై గంభీర్ ఫోకస్ .. భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్‌కు సర్వం సిద్ధం!

గాలే పిచ్‌పై గంభీర్ ఫోకస్ .. భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్‌కు సర్వం సిద్ధం!

IND vs SL Test Series: ఆగస్టు 15వ తేదీ నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ స్వయంగా పిచ్‌ను పరిశీలించడం, గ్రౌండ్‌స్టాఫ్ ఎప్పటికప్పుడు పిచ్‌లో మార్పులు చేస్తుండటంతో తుది జట్టు కూర్పుపై ఉత్కంఠ మరింత పెరిగింది. 

పిచ్ కండిషన్: 

పిచ్ తొలి రోజు నుంచి టర్న్ అవుతుందా లేదా అనే దానిపైనే భారత్ తుది జట్టు ఆధారపడి ఉంది. పిచ్‌పై స్పష్టమైన టర్న్ కనిపించకపోతే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రూపంలో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ స్పిన్‌కు అనుకూలిస్తే కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనుండగా, పరిస్థితిని బట్టి సరాన్ష్ జైన్ కూడా రేసులో నిలవవచ్చు. ఇక బుమ్రాతో పాటు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు అందుబాటులో లేకపోవడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కాస్త తలనొప్పిగా మారింది.

వాతావరణ ప్రభావం: 
గాలేలో వాతావరణంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. జట్టు గాలేకు చేరుకున్నప్పటి నుంచి భారీ వర్షాలు కురిసినప్పటికీ, బుధవారం మాత్రం ఎండ కాయడంతో గ్రౌండ్‌స్టాఫ్ కవర్లను తొలగించి పిచ్‌ను సిద్ధం చేశారు. కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్‌లో ఒక వారం పాటు సాగిన సుదీర్ఘ ప్రాక్టీస్, మ్యాచ్-సిమ్యులేషన్ సెషన్ల ద్వారా భారత్ పూర్తి సిద్ధమైంది. ఆగస్టు 13, 14 తేదీల్లో గాలే వేదికగా ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని గిల్ సేన తొలి టెస్ట్‌కు తుది మెరుగులు దిద్దనుంది.