జమ్మికుంటలో రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి

జమ్మికుంటలో రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైలు ఢీకొని 150 గొర్రెలు చనిపోయాయి. జమ్మికుంట మండలం మడిపల్లి  రైల్వే గేట్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఢీకొని 150 గొర్రెలు చనిపోయాయి. గొర్రెల విలుల 10 లక్షల వరకు ఉంటుందని వాటి యజమానులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు.