ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అదృశ్యం

 ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అదృశ్యం

మియాపుర్ : ఒకే ప్యామీలీకి చెందిన ముగ్గురు అదృశ్యమైన సంఘటన సోమవారం మియాపూర్పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ హఫిజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్న దీపిక (34),సాయి లిపి (14), చైతన్య (9) శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వేళ్లి తిరిగి రాలేదని తెలిపారు కుటుంబ సభ్యులు. రెండు రోజులుగా బంధువుల ఇంట్లో, చుట్టుపక్కల ఎంత వెతికిన దోరక పోవడంతో సోమవారం మియాపూర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా ఆపరేషన్ స్టార్ట్ చేశామని తెలిపారు.