హైదరాబాద్, వెలుగు: చైనాకు చెందిన 9 మంది కరోనా అనుమానంతో ఆస్పత్రుల్లో చేరారు. ఏడుగురు ఫీవర్ హాస్పిటల్లో, ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఫీవర్లో చేరిన వాళ్లకు కరోనా లక్షణాల్లేవని, ముందు జాగ్రత్తగా వాళ్ల బ్లడ్ శాంపిళ్ల టెస్టులకు పంపామని హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. వాళ్లంతా జనవరి 31న చైనా నుంచి ఇండియాకు వచ్చారన్నారు. ఇటు గాంధీలోనూ ఇద్దరు చైనీయులు సహా 11 మంది కరోనా అనుమానంతో చేరారు. వాళ్లకూ కరోనా లక్షణాలు లేవని, వాళ్లంతా చైనాకు వెళ్లి రావడంతో శాంపిళ్లు సేకరించి టెస్టులు చేస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. గాంధీలోని 11 మంది, ఫీవర్ ఆస్పత్రిలోని 9 మంది టెస్టుల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ చెప్పింది. ఇప్పటిదాకా 57 మందికి టెస్టులు చేయించగా 37 మందికి కరోనా నెగెటివ్గా తేలింది. కాగా, శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఎయిర్పోర్టులో కరోనా స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే వైరస్ ప్రభావిత దేశాల నుంచి వస్తున్న వారిని థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. ఎయిర్పోర్టులో ఆయుష్ డిపార్ట్మెంట్ స్టాల్ను స్టార్ట్ చేశారు. ఆయుష్ మినిస్ట్రీ సూచన మేరకు ‘ఆర్సెనిక్ ఆల్బమ్ 30’ మందుల పంపిణీని ప్రారంభించారు. వాటిని వేసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి వైరస్లు దరిచేరవని అధికారులు చెబుతున్నారు. వెల్లుల్లి గాని, నువ్వుల నూనె గాని కరోనా చికిత్సకు పని చేయవని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది.
కరోనా అనుమానం : ఫీవర్, గాంధీల్లో చేరిన 9 మంది
- తెలంగాణం
- February 7, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు