బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి

హైదరాబాద్ : సికింద్రాబాద్ లాలాపేట్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ.. పరమేష్ యాదవ్(39) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న లాలాగూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం పరమేష్  మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకు తరలించారు. నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో గుండెపోటుతో పరమేష్ చనిపోయినట్లు చెబుతున్నారు. మృతుడు పరమేష్  మల్కాజిగిరి వాసి.