ఈ నెల 10న తిరిగి తెరుచుకోనున్న సాలార్‌జంగ్ మ్యూజియం

ఈ నెల 10న తిరిగి తెరుచుకోనున్న సాలార్‌జంగ్ మ్యూజియం

‌హైద‌రాబాద్‌:  న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్ర‌దేశం సాలార్‌జంగ్ మ్యూజియం తెరుచుకోనుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించడంతో.. అప్ప‌టి నుండి సాలార్‌జంగ్ మ్యూజియం మూసివేయ‌బ‌డింది. అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో… ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌నార్థం ఈ నెల 10వ తేదీన తిరిగి తెరుచుకోనుంది. సంద‌ర్శ‌కుల‌కు ప్ర‌వేశ ద్వారంలో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహాకులు, మ్యూజియం అధికారులు తెలిపారు. ప‌ర్యాట‌కులు ఫేస్ క‌వ‌ర్, మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలని సూచించారు. సంద‌ర్శ‌న స‌మ‌యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాల‌న్నారు. కాగా వృద్ధులు, గ‌ర్భిణీలు, చిన్న‌పిల్ల‌లు, శిశువుల‌కు అనుమ‌తి లేదని తెలిపారు.