సిడ్నీ: కంగారూ కంట్రీ ఆస్ట్రేలియాలో ఈ ఏడాది మొదట్లో చెలరేగిన కార్చిచ్చుపై ఆ దేశ ప్రభుత్వం విస్తృత స్థాయి విచారణను ప్రారంభించింది. ఈ బుష్ ఫైర్స్ వల్ల 33 మంది పౌరులు చనిపోగా, 2,500 మంది నిరాశ్రయులయ్యారు. అలాగే సౌత్ కొరియా అంత పరిమాణంలో ఉన్న ఒక ప్రాంతం ధ్వంసం అయింది. వందలాది మంటలు, వాటిలో కొన్ని భారీ సైజులో జరిగినవి ఉండటంతో ఆస్ట్రేలియా ఈస్ట్ కోస్ట్ కాలిపోయింది. ఎట్టకేలకు దీనిని ఫిబ్రవరిలో అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. ‘ఈ విధ్వంసం వల్ల జీవితాన్ని కోల్పోయాం. ఇళ్లు ధ్వంసమవడం, పశువులు చనిపోవడంతోపాటు లక్షలాది హెక్టార్ల అడవులు విధ్వంసమవడం ప్రజల జీవనం, కోలుకోవడంపై లోతుగా ప్రభావం చూపుతున్నాయి’ అని కార్చిచ్చుపై ఎంక్వయిరీ నిర్వహిస్తున్న చైర్ ఆఫ్ ద ఎంక్వయిరీ మార్క్ బిన్ స్కిన్ ఓ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో సంభవించే కార్చిచ్చులకు సంసిద్ధత కోసం ఈ విషయంపై ఆరు నెలల పాటు రాయల్ కమిషన్ ఇన్వెస్టిగేట్ చేయనుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ చెప్పారు. అలాగే ఎమర్జెన్సీ అథారిటీస్ కు ఎవరు బాధ్యత వహిస్తారో కూడా రాయల్ కమిషన్ సూచిస్తుందన్నారు. కాన్ బెర్రాలో రెండు వారాల పాటు రాయల్ కమిషన్ విచారణ కొనసాగనుంది. దీంట్లో గ్లోబల్ క్లైమేట్ ను మార్చడంతోపాటు నేచురల్ డిజాస్టర్ రిస్క్ ను మార్చడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
కార్చిచ్చుపై ఆస్ట్రేలియా ఎంక్వయిరీ
- విదేశం
- May 25, 2020
లేటెస్ట్
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
Most Read News
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు