ఓల్డ్ సిటీలో బైకర్స్ బీభత్సం..పలువురిపై దాడి

ఓల్డ్ సిటీలో బైకర్స్ బీభత్సం..పలువురిపై దాడి

ఓల్డ్ సిటీ ఏరియాలో రోజుకో అరాచకం వెలుగుచూస్తోంది. రాత్రయిందంటే చాలు... తెల్లవారే సరికి ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ వెహికిల్ ఎక్కి హల్ చల్ చేశాడు . పోలీసు వాహనంతోపాటు ఇతర వాహనాల అద్దాలు పగులగొట్టారు. . దారినపోయే వారిపై దాడికి పాల్పడ్డాడు. లేటెస్ట్ గా ఓల్డ్ సిటీ కాలాపత్తర్ ఏరియాలో బైకర్స్ ర్యాష్ డ్రైవింగ్ తో రెచ్చిపోయారు. ప్రశ్నించిన యువకున్ని చితకబాదారు. పోకిరీల దాడిలో మహిళలకు గాయాలయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో బైకర్స్ ఉన్నారు.