తలసానిని అడ్డుకున్న BJYM కార్యకర్తలు

తలసానిని అడ్డుకున్న BJYM కార్యకర్తలు

హైదరాబాద్: సైదాబాద్ లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అడ్డుకున్నారు భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 33 నెలల నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రులను అడ్డుకున్న BJYM కార్యకర్తలను లాగి పడేశారు పోలీసులు.