కరోనా కిట్టులో మద్యం సీసాలు

కరోనా కిట్టులో మద్యం సీసాలు
  • పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి తీరుపై విమర్శల వెల్లువ

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేసిన కరోనా మెడికల్ కిట్లలో మద్యం సీసాలు ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్​ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ ​శంకర్​నాయక్​ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్​కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్​ కౌన్సిలర్లు తదితరులకు  వీటిని అందజేశారు. కొందరు శుక్రవారం  కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్​ లిక్కర్​ బాటిల్​ ఉండటంతో అవాక్కయ్యారు. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మద్యం సీసాలు పంపడం ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్​వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.