రాజేంద్రనగర్ లో కారు భీభత్సం.. ఇద్దరికి గాయాలు

రాజేంద్రనగర్ లో కారు భీభత్సం.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్:  రాజేంద్ర నగర్ పోలీస్టేషన్ పరిదిలో కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిలబడిన తల్లీ కూతురుపైకి కారుదూసుకెళ్లింది. రాజేంద్రనగర్ లోని ఢీమార్ట్ లో షాపింగ్ చేసిన తల్లీకూతుర్లు బయట రోడ్డుపైకి రాగా అటునుంచి వచ్చిన కారు వీరిని ఢీకొట్టి పిల్లర్ ను గుద్దుకుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్లు కారును వదిలేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.