- ఏప్రిల్లో రెన్యువల్ చేయని ఆఫీసర్లు
- స్టేట్ వైడ్ 1,527 మంది ఎదురు చూపులు
- ఆర్థిక ఇబ్బందుల్లో వారి కుటుంబాలు
యాదాద్రి, వెలుగు: హెల్త్ డిపార్ట్మెంట్లో 2003లో రిక్రూట్ అయిన1,527 మంది కాంట్రాక్ట్ హెల్త్వర్కర్స్కు నాలుగు నెలలుగా జీతాలు రావట్లేదు. ఆఫీసర్లు రెన్యువల్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని హెల్త్వర్కర్స్ అంటున్నారు. ప్రతి ఏడాది లాగే 2021–22 ఫైనాన్షియల్ ఇయర్లోనూ రెన్యువల్చేయాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలు చెబుతూ ఆఫీసర్లు వాయిదా వేస్తున్నారు. ఫైనాస్షియల్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదని ఒకసారి, సీఎంవోలో ఫైలు పెండింగ్లో ఉందని మరోసారి, డ్యూటీ చేస్తున్న హెల్త్ వర్కర్స్ అందరి డేటా కావాలని ఇంకోసారి చెబుతూ కాలయాపన చేస్తున్నారని హెల్త్ వర్కర్స్అంటున్నారు. ఆఫీసర్ల తీరుతో తమ కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
ఏటా చేయాల్సిందే..
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్సెలక్షన్కమిటీ–2003 ద్వారా స్టేట్వైడ్ హెల్త్అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ శాంక్షన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో రిక్రూట్ చేశారు. జీవో నెంబర్–16 ప్రకారం వారి సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల పక్కనపెట్టారు.18 ఏండ్లుగా ఏటా రెగ్యులర్గా రెన్యువల్చేస్తూ వస్తున్నారు. రెన్యువల్చేస్తేనే డిస్ట్రిక్ ట్రెజరీ నుంచి వీరికి జీతాలు విడుదల అవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్లో రెన్యువల్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,527 మంది కాంట్రాక్ట్ హెల్త్ వర్కర్స్ జీతాలు ఆగిపోయాయి. ఇందులో హెల్త్ అసిస్టెంట్లు 1,139, ఫార్మాసిస్ట్189, లాబ్ టెక్నిషియన్లు 199 మంది ఉన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్వేవ్తీవ్రంగా ఉన్న సమయంలో పీహెచ్సీల్లో వీరి సేవలు కీలకంగా మారాయి. టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీరే ముందుండి పనిచేశారు. రెన్యువల్ చేయకపోవడంతో జీతాలు రాక ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. 2021–-22 రెన్యువల్కు సంబంధించి ఉత్తర్వులు వెంటనే జారీచేసి జీతాలు అందేలా చూడాలని హెల్త్వర్కర్స్ కోరుతున్నారు.