ఇండియాలో 2011 కులగణనలో అన్ని తప్పులే.?

ఇండియాలో 2011 కులగణనలో అన్ని తప్పులే.?

ఇండియాలో 2011లో చేసిన కులగణనలో అన్ని తప్పులే ఉన్నాయి. అప్పటికే దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే అందులో 90 కోట్ల జనాభా కులాల్నే లెక్కించారు. 2011 ముందు సేకరణ యంత్రాంగం సరిగ్గా లేదు. దాంతో లెక్కలు తీసుకునే వాళ్లు రకరకాల తప్పులు చేశారు. ఒకే కులం పేరుని వేరువేరు స్పెల్లింగులతో రాయడంతో ఒకే కులం అనేక కులాలుగా రికార్డు అయ్యింది. దాంతో ఏ జనాభా ఏ కులానిదో తేల్చడం చాలా కష్టంగా మారిపోయింది. 

ఉదాహరణకు.. మహారాష్ట్రలో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దాదాపు500 ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఉంటే, 2011లో సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం నాలుగు లక్షల 28 వేల కులాలు ఉన్నట్టు తేలింది. రాష్ట్ర జనాభా10 కోట్లు ఉంటే.. వాళ్లలో కోటీ పదిలక్షల మంది తమకు కులమే లేదన్నారు.1931 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,147 కులాలు ఉంటే, 2011 నాటి కులగణన ప్రకారం 46 లక్షల కులాలు ఉన్నాయి. అందుకే కేంద్రం ఆ సమాచారం బయటపెట్టలేదు.