మహబూబ్ నగర్ లో మొసళ్ల హల్ చల్..

మహబూబ్ నగర్ లో మొసళ్ల హల్ చల్..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొసళ్లు హల్ చల్ చేస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో…వరద నీటిలో మొసళ్లు కొట్టుకొస్తున్నాయి. పంటపొలాలు, బావుల్లోకి చేరి రైతులను భయపెడుతున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలోని బావిలో మొసలి కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. బావి దగ్గరకు చేరుకున్న అటవీ సిబ్బంది…రైతులతో కలిసి మొసలిని బయటకు తీసి కృష్ణానదిలో వదిలారు.