ముంబై: ఐపీఎల్ నుంచి వైదొలిగి తానేం కోల్పోయాడో సురేశ్ రైనా చాలా త్వరగా తెలుసుకుంటాడని వ్యాఖ్యానించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఎన్. శ్రీనివాసన్..యూ టర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నాడు. సీఎస్కేలో రైనా కంట్రిబ్యూషన్కు వెల కట్టలేమన్నాడు. ‘కొన్నేళ్లుగా రైనా సీఎస్కేకు అందిస్తున్న కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. దానిని ఎప్పటికీ మరువలేం.కొంత మంది నా వ్యాఖ్యలను మిస్ అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ టైమ్లో రైనా పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కష్టకాలంలో అతనికి మా సపోర్ట్ఉంటుంది’ అని శ్రీని వెల్లడించాడు. 2008 నుంచి చెన్నైకి ఆడుతున్న రైనా.. 193 మ్యాచ్ల్లో 5368 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రైనా ప్లేస్లో రుతురాజ్
చెన్నై మిడిలార్డర్కు అత్యంత కీలకమైన రైనా ప్లేస్ను యంగ్స్టర్ రుతురాజ్తో భర్తీ చేయాలని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేసిన మూడు రోజుల క్యాంప్లో రుతురాజ్ బ్యాటింగ్కు ధోనీ ఫిదా అయ్యాడు. ఎక్కువ చాన్స్లు ఇస్తే మరింత రాటుదేలుతాడని మహీ భావిస్తున్నట్లు సమాచారం. కరోనాతో పోరాడుతున్న రుతురాజ్ఇ న్టైమ్లో అందుబాటులోకి రాకుంటే ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ను ఆడించే చాన్స్ ఉంది. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ కూడా రైనా బాటలో నడుస్తున్నట్లు తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం యూఏఈకి బయలుదేరాల్సిన భజ్జీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ఆసీస్ పేసర్ హాజిల్వుడ్ కూడా పాజిటివ్ కేసులపై ఆరా తీస్తున్నాడు. కానీ అతను యూఏఈ వచ్చే చాన్స్లు చాలా ఉన్నాయి.
ఫస్ట్ లెగ్ దుబాయ్లోనే..
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఫస్ట్ లెగ్ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే నిర్వహించాలని ఐపీఎల్ పాలకులు భావిస్తున్నారు. లీగ్లోని ఎనిమిది టీమ్ల్లో ఆరు దుబాయ్లోనే ఉన్నాయి. అబుదాబి బేస్గా ఉన్న ముంబై, కోల్కతాను కూడా దుబాయ్ రప్పించి లీగ్లో తొలి 20 మ్యాచ్లను అక్కడే నిర్వహించాలని ప్రస్తుతం అనుకుంటున్నారు.
బాల్కనీ లేకపోవడం వల్లే..
వ్యక్తిగత కారణాలతో రైనా టోర్నీ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చినా.. అసలు విషయం మాత్రం వేరేగా ఉంది. దుబాయ్లోని తాజ్ హోటల్లో తనకు కేటాయించిన సూట్లో బాల్కనీ లేకపోవడం రైనాకు నచ్చలేదట. టీమ్లో పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో అటుఇటు తిరగడానికి సరైన స్పేస్ కావాలని బ్యాట్స్మన్ కోరుకున్నాడని, అది లేకపోవడంతో ఆగ్రహాంతో టోర్నీ నుంచి వైదొలిగాడని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై శ్రీని వివరణ ఇచ్చాడు. ‘సీఎస్కేకు ఆడుతున్న కుర్రాళ్లందరూ మా ఫ్యామిలీ వంటివారు. పదేళ్లుగా వాళ్లు మాతోనే కలిసున్నారు. టోర్నీకి క్రికెటర్లు చాలా ప్రధానం. కానీ నేను చెప్పిన మాటలను నెగెటివ్గా తీసుకున్నారు’ అని బీసీసీఐ మాజీ బాస్ వెల్లడించాడు.