భద్రాద్రి, యాదాద్రిలలో భక్తుల రద్దీ..!

భద్రాద్రి, యాదాద్రిలలో భక్తుల రద్దీ..!

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో.. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామీ,అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించకున్నారు.  కళ్యాణ కట్ట, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కేంద్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 2గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు.. కూర్మావతరామంలో సీతారామచంద్రస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. ITDA PO స్వామివారిని దర్శించుకుని పల్లకీ సేవలో పాల్గొన్నారు. మిథిలా ప్రాంగణంలో భక్తుల పూజలందుకున్నారు భద్రాద్రి రామయ్య.