- డార్క్నెట్ ద్వారా లైసెర్జిక్ యాసిడ్ డై థైలమైడ్ కొనుగోలు
- తాను వాడుతూ.. ఇతర స్టూడెంట్లకు సప్లయ్
- ఏడుగురిని అరెస్ట్ చేసిన నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఓ స్టూడెంట్డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి సాగిస్తున్న దందాను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఛేదించింది. అతనితోపాటు ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. హెచ్సీయూ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు టార్గెట్గా జరుగుతున్న ఈ మత్తు దందా వివరాలను నార్కోటిక్వింగ్అడిషనల్ డీసీపీ చక్రవర్తితో కలిసి సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కూకట్పల్లి గాజులరామారానికి చెందిన నిమ్మగడ్డ సాయి విఘ్నేష్(23) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో పీజీ చేస్తున్నాడు. చెడు అలవాట్లతో లిక్కర్, డ్రగ్స్కు బానిసయ్యాడు. డార్క్నెట్లో డ్రగ్స్ కోసం వెతికాడు. లైసెర్జిక్ యాసిడ్ డైథైలమైడ్(ఎల్ఎస్డీ) బ్లాట్స్ గురించి స్టడీ చేశాడు. ఒక్కో బ్లాట్ను రూ.600 చొప్పున కొనుగోలు చేసేవాడు. హెచ్సీయూలో చదువుతున్న తన ఫ్రెండ్స్ నిఖిల్, ప్రీతమ్, వంశీ, రాహుల్, తేజ, ఉమెన్ స్టూడెంట్స్ సుష్మ, ఎలిజిబెత్కు డ్రగ్స్ అందించేవాడు. వీరితోపాటు కేపీహెచ్బీలోని ఓ డిగ్రీ కాలేజీకి చెందిన సాయి చైత్ర(21), మరో కాలేజ్ స్టూడెంట్ నాగార్జున(20), నోవారిటీస్ క్యూ సీ అసోసియేట్ సాయిబాలాజీ(35), సాఫ్ట్ వేర్ డెవలపర్ అనుదీప్(32), టెక్ మహేంద్ర టెక్నికల్ సపోర్ట్ ఎంప్లాయ్ తేజస్వికుమార్(30)కు మరో ఆరుగురు ఐటీ ఎంప్లాయిస్కి డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు.
ట్రేస్చేసిన పోలీసులు
విఘ్నేష్ ఎప్పటిలాగే గత నెల 20 ఎల్ఎస్డీ బ్లాట్స్ ఆర్డర్ చేశాడు. నార్కోటిక్ఎన్ఫోర్స్మెంట్వింగ్విఘ్నేష్ ఆర్డర్ను ట్రేస్ చేసింది. మైత్రివనంలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు స్టూడెంట్స్ కోసం వెతుకుతున్నారు.